ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు -1

రామాయణం



  1. 1.   భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్

  2. 2.   కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్

  3. 3.   కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).

  4. 4.   రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా

  5. 5.   పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక
  6. 6.   సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్

  7. 7.   మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్

  8. 8.   కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం

  9. 9.   దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.

  10. 10.   సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది.

  11. 11.   ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.

  12. 12.   తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్

  13. 13.   అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్

  14. 14.   కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్

  15. 15.   గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు - శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర

  16. 16   దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.

  17. 17.   చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.

  18. 18.   పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర.


  1. 19.   కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.

  2. 20.   శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక.

  3. 21.   హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.

  4. 22.   ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక

  5. 23.   విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.

  6. 24.   శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు

  7. 25.   రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక.

  8. 26.   అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక

  9. 27.   శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక

  10. 28.   సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక.

  11. 29.   వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.

  12. 30.   కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్.

  13. 31.   లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్

  14. 32.   తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్

  15. 33.   పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్


5 comments

August 4, 2009 at 4:57 PM

మీరు ఈ విషయలు ఇంకా విశదీకరిస్తే , అంటే ఎమైనా ఆధారాలు వుంటె తెలుపగలరు., ఎందుకంటే ఇక్కడ బ్లొగ్ లొకంలో అందరు ఎగతాళి చెసె వాల్లే మన పురణాలని.....

Reply

విజయక్రాంతి గారు,

ధన్యవాదాలు.చాలా పుస్తకాలు తిరగేసి,వెబ్ సైట్లు చదివి ఈ విషయాలు వ్రాయటం జరిగింది.ఇక్కడ పేర్కొన్న ప్రతి ప్రదేశానికీ నేను ఆధారాలు ఇవ్వాలంటే ప్రదేశానికో వ్యాసం లాంటి టపా వ్రాయాలి.ఇక్కడ ఇచ్చిన ఆధునిక పేర్లతో గూగుల్ చెయ్యండి.ఆదొక మార్గం.

ద్వారక లో శ్రీ కృష్ణుని కాలం నాటి ఆనవాళ్ళు మన పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.ఆయిన సరే 'మేం నమ్మం' అనే వారికి మనం ఏం చెప్పగలం.

Reply
January 9, 2011 at 10:33 PM

మీ కృషి కి ఎంతో ధన్యవాదాలు ఇలాగే మీరు ఎన్నో మంచి విషయాలు అందరికి తెలియచెయ్యాలని ఆకాంక్షిస్తున్నాను

Reply

సాయి గారు,
ధన్యవాదాలు

Reply
March 15, 2016 at 6:52 PM

Namaste andi.. meeru post chesina vatini nenu na fb page lo share chesanu ..
https://www.facebook.com/TirthYatrainfo/

Reply
Post a Comment